తెలంగాణలో కొత్తగా 169 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Mango News, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Telangana Reports 169 New Covid-19 Cases, Total COVID 19 Cases

తెలంగాణ రాష్ట్రంలో మరో 169 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఫిబ్రవరి 4, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,95,270 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి కొత్తగా 189 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 2,91,699 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 98.79 శాతంగా ఉంది.

ఇక కరోనా వలన మరొకరు మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 1607 కి పెరిగినట్టు తెలిపారు. కాగా మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,964 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 31, మేడ్చల్-మల్కాజ్ గిరిలో 11, కరీంనగర్ లో 10, రంగారెడ్డి జిల్లాలో 8, వరంగల్ అర్బన్ లో 8 నమోదయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − four =