కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. దేశంలో రోజువారీగా అత్యధిక కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 4,064 కరోనా కేసులు, 15 మరణాలు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 64,87,837 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 64,803 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 9,531 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 63,80,561 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 41,675 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 7130 యాక్టీవ్ కేసులు ఉండగా, తిరువనంతపురంలో 4853, కొట్టాయంలో 4118, త్రిస్సుర్ లో 3871, కోజికోడ్ లో 3602, ఇడుక్కిలో 3509, మలప్పురంలో 2657, కొల్లంలో 2633, అలపుజాలో 2555 కేసులు ఉన్నాయి. మరోవైపు గురువారం నాటికి కేరళలో 4,58,29,251 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ