దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. రోజువారీగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 40,953 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,15,55,284 కు చేరుకుంది. కరోనాతో మరో 188 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,59,558 కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 2,88,394 (2.50%) యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా మహారాష్ట్ర (25681), పంజాబ్ (2470), కేరళ (1984), కర్ణాటక (1587), గుజరాత్ (1415), మధ్యప్రదేశ్ (1140), ఛత్తీస్ ఘడ్ (1097), తమిళనాడు (1087) వంటి రాష్ట్రాల్లో 1,000 కి పైగా కొత్త కేసులను నమోదయ్యాయి. అలాగే గత 24 గంటల్లో అస్సాం, ఉత్తరాఖండ్, ఒడిశా, పుదుచ్చేరి, లక్షద్వీప్, సిక్కిం, లద్దాఖ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబర్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 15 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలాంటి కరోనా మరణాలు నివేదించబడలేదు.
దేశంలో కరోనా రికవరీ రేటు 96.12 శాతం, మరణాల రేటు 1.38 శాతం:
దేశంలో మరో 23,653 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 1,11,07,332 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 96.12 శాతం గానూ, మరణాల రేటు 1.38 శాతంగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో రోజువారీ కరోనా కేసులు నమోదు ఎక్కువుగా ఉంది. కొత్తగా నమోదైన 40,953 కేసులలో 83.7 శాతం ఈ 6 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ