దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. గత 24 గంటల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కొత్త కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 43,846 కరోనా కేసులు, 197 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,15,99,130 కు, మరణాల సంఖ్య 1,59,755 కు చేరుకుంది. దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య మళ్ళీ 3 లక్షలు (3,09,087) దాటింది. మరోవైపు 22,956 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 1,11,30,288 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 95.96 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.38 శాతంగా ఉంది.
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 83 శాతం 6 రాష్ట్రాలలోనే:
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో 83 శాతం మహారాష్ట్ర(27126), పంజాబ్ (2578), కేరళ (2078), కర్ణాటక (1798), గుజరాత్ (1565), మధ్యప్రదేశ్ (1308) వంటి 6 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి. ఇక మార్చి 20, శనివారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 23,35,65,119 కు చేరుకుంది. గత 24 గంటల్లో 11,33,602 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ