దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా మళ్ళీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 46,232 కరోనా కేసులు, 564 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 90,50,597 కు, మరణాల సంఖ్య 1,32,726 కు చేరుకుంది. కాగా దేశంలో ప్రస్తుతం 4,39,747 మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు
మరోవైపు కొత్తగా 49,715 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 84,78,124 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 93.67 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.47 శాతంగా ఉంది. ఇక నవంబర్ 20 నాటికీ మొత్తం 13 కోట్లకుపైగా (13,06,57,808) కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లోనే 10,66,022 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ