ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 93,759 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 3,464 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 667, చిత్తూరులో 597, పశ్చిమగోదావరిలో 397, ప్రకాశంలో 349, నెల్లూరులో 262 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,96,818 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 35 మరణాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరులో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కడపలో ఒకరు, కర్నూల్ లో ఒకరు, పశ్చిమగోదావరిలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 12779 కి పెరిగింది. గత 24 గంటల్లో 4,284 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 18,46,716 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 37,323 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ