దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కొద్దిగా తగ్గుముఖం పట్టింది. అయితే వరుసగా మూడో రోజూ కూడా 4 వేలకుపైగా కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,43,144 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,40,46,809 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 4000 మంది మరణించడంతో మరణాల సంఖ్య 2,62,317 కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 37,04,893 (15.41%) యాక్టీవ్ కేసుల ఉన్నాయి.
కొత్తగా మహారాష్ట్ర (42,582), కేరళ (39,955), కర్ణాటక (35,297), తమిళనాడు (30,621), ఆంధ్రప్రదేశ్ (22,399), వెస్ట్ బెంగాల్ (20,839), ఉత్తర్ ప్రదేశ్ (17,745), రాజస్థాన్ (15,867), హర్యానా (12,286), గుజరాత్ (10,742) వంటి 10 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 3,43,144 కేసులలో 72.37 శాతం ఈ 10 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి. ఇక దేశంలో మరో 3,44,776 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 2,00,79,599 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 83.50 శాతం గానూ, మరణాల రేటు 1.09 శాతంగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ