దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పూర్తి అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో 5 వేలలోపే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 4,912 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 24, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,45,63,337 కు చేరుకుంది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 1.62 శాతంగా నమోదైంది. అలాగే కరోనాతో మరో 38 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,28,487 కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఒడిశా, గుజరాత్, తెలంగాణ, ఢిల్లీ వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
దేశంలో 44,436 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.71 శాతం:
దేశంలో ప్రస్తుతం 44,436 (0.10%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 5,719 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,39,90,414 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.71 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇక సెప్టెంబర్ 23, శుక్రవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 89.33 (89,33,52,145) కోట్లకు చేరుకుంది. గత 24 గంటల్లో 3,03,888 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY