దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. ఆగస్టు 11, మంగళవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,68,675 కు పెరిగింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 53,601 కరోనా పాజిటివ్ కేసులు, 871 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో కరోనా వలన మరణించిన వారి మొత్తం సంఖ్య 45,257 కు చేరింది. అయితే కరోనా మరణాల రేటు 1.99 శాతంగా ఉండగా, కరోనా రికవరీ రేటు 69.80 శాతంగా ఉంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు వ్యవధిలో నమోదవుతున్న కరోనా కేసుల్లో భారత్లోనే ఎక్కువుగా నమోదవడం ఆందోళనగా మారుతుంది. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి.
దేశంలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 11, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 22,68,675
- కొత్తగా నమోదైన కేసులు [ఆగస్టు 10–ఆగస్టు 11(8AM-8AM)] : 53,601
- నమోదైన మరణాలు : 871
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 1,583,489
- యాక్టీవ్ కేసులు : 639,929
- మొత్తం మరణాల సంఖ్య : 45,257
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu