దేశంలో రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.44 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 67,084 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 10, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,24,78,060 కు చేరుకుంది. గత 24 గంటల్లో మరో 1,241 కరోనా మరణాలు నమోదవడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,06,520కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
దేశంలో దాదాపు 8 లక్షల యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 96.95 శాతం:
దేశంలో ప్రస్తుతం దాదాపు 8 లక్షల (7,90,789–1.86%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 1,67,882 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య కూడా 4,11,80,751 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 96.95 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. అలాగే ఫిబ్రవరి 10, గురువారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 74,61,96,071 కు చేరుకుంది. ఫిబ్రవరి 10న 15,11,321 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ