దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 72,330 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,22,21,655 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 459 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,62,927 కి పెరిగింది. దేశంలో మళ్ళీ యాక్టీవ్ కేసుల సంఖ్య 6 లక్షలకు (5,84,055) చేరువైంది. కొత్తగా మహారాష్ట్ర (39544), ఛత్తీస్ ఘడ్ (4563), కర్ణాటక (4225), పంజాబ్ (2944),కేరళ (2653), తమిళనాడు (2579), గుజరాత్ (2360), మధ్యప్రదేశ్ (2332) వంటి 8 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 72,330 కేసులలో 84.61% శాతం ఈ 8 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి
దేశంలో కరోనా రికవరీ రేటు 93.89 శాతం, మరణాల రేటు 1.33 శాతం:
దేశంలో మరో 40,382 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 1,14,74,683 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 93.89 శాతం గానూ, మరణాల రేటు 1.33 శాతంగా ఉంది. అలాగే గత 24 గంటల్లో చండీగర్, జార్ఖండ్, ఒడిశా, లద్దాఖ్, పుదుచ్చేరి, మణిపూర్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్, లక్షద్వీప్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబర్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 15 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలాంటి కరోనా మరణాలు నివేదించబడలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ