దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల నమోదు పెరుగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 796 కరోనా కేసులు నమోదవడంతో మార్చి 17, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,93,506 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 5 మరణాలు (కర్ణాటకలో 1, ఉత్తర్ ప్రదేశ్ లో 1, పుదుచ్చేరిలో 1, హిమాచల్ ప్రదేశ్ లో 1, కేరళలో రికాంసైల్డ్ 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,795కి పెరిగింది. కాగా మార్చి 16న 98,727 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.81 శాతంగా నమోదైంది.
దేశంలో 5,026 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.80 శాతం:
దేశంలో ప్రస్తుతం యాక్టీవ్ కరోనా కేసులు సంఖ్య 5,026 (0.01%)కి చేరింది. ఇక కొత్తగా 388 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,57,685కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర (226), గుజరాత్ (119), కేరళ (105), కర్ణాటక (77), తమిళనాడు (49) వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు నమోదు ఎక్కువుగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE