తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ల లీకేజి వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ పలు పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను కూడా టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. అలాగే ఏఈఈ మరియు డిఏఓ పరీక్షలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను తిరిగి జూన్ 11వ తేదీన నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు టీఎస్పీఎస్సీ మార్చి 17, శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
“ఈ రోజు ఉదయం 11:30 గంటలకు కమిషన్ ప్రత్యేక సమావేశం నిర్వహించింది మరియు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదికను మరియు కమిషన్ నిర్వహించిన అంతర్గత విచారణను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈఈ మరియు డిఏఓ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను 2023, 11 జూన్, 2023న మళ్లీ నిర్వహించాలని నిర్ణయించాం. ఇతర పరీక్షల పునఃనిర్వహణ తేదీలు కూడా త్వరలో తెలియజేయబడతాయి” అని టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
టీఎస్పీఎస్సీ రద్దు చేసిన పరీక్షలు ఇవే:
- గ్రూప్-1 ప్రిలిమ్స్ (నోటిఫికేషన్ నెం.4/2022) – పరీక్ష నిర్వహించిన తేదీ 2022, అక్టోబర్ 16
- ఏఈఈ పరీక్ష (నోటిఫికేషన్ నెం.12/2022) – పరీక్ష నిర్వహించిన తేదీ 2023, జనవరి 22
- డిఏఓ పరీక్ష (నోటిఫికేషన్ నెం.8/2022) – పరీక్ష నిర్వహించిన తేదీ 2023, ఫిబ్రవరి 26.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE