దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 9,102 కరోనా కేసులు, 117 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,76,838 కు, మరణాల సంఖ్య 1,53,587 కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్స్ మరియు ఆసుపత్రుల్లో 1,77,266 (1.66%) మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరోవైపు కొత్తగా 15,901 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 1,03,45,985 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 96.90 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.44 శాతంగా ఉంది.
ఇక జనవరి 25 నాటికీ దేశవ్యాప్తంగా 19,30,62,694 కరోనా పరీక్షలు నిర్వహించగా, గత 24 గంటల్లో 7,25,577 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో కేరళలో 3361, మహారాష్ట్రలో 1842, తమిళనాడులో 540, ఛత్తీస్ గడ్ లో 482, గుజరాత్ లో 390, కర్ణాటకలో 375, వెస్ట్ బెంగాల్ లో 406, మధ్యప్రదేశ్ లో 200 కేసులు నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ