దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. జూలై 3, శుక్రవారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 6,25,544 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 20,903 కరోనా పాజిటివ్ కేసులు, 379 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఒకరోజు వ్యవధిలో అత్యధికంగా ఇన్ని కరోనా కేసులు నమోదవడం ఇదే తొలిసారి.
అలాగే దేశంలో కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 18,213 కి చేరింది. కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 3,79,893 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 2,27,439 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా ల తర్వాత భారత్ నాలుగో స్థానంలో ఉంది. అలాగే కరోనా మరణాల్లో మాత్రం భారత్ ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో కొనసాగతుంది.
దేశంలో 1000 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- మహారాష్ట్ర – 1,86,626
- తమిళనాడు – 98,392
- ఢిల్లీ – 92,175
- గుజరాత్ – 33,999
- ఉత్తర ప్రదేశ్ – 24,825
- పశ్చిమబెంగాల్ – 19,819
- రాజస్థాన్ – 18,662
- తెలంగాణ – 18,570
- కర్ణాటక – 18,016
- ఆంధ్రప్రదేశ్ – 16,097
- హర్యానా – 15,509
- మధ్యప్రదేశ్ – 14,106
- బీహార్ – 10,682
- అస్సాం – 9,435
- జమ్మూ కశ్మీర్ – 7,849
- ఒడిశా – 7,545
- పంజాబ్ – 5,784
- కేరళ – 4,754
- ఛత్తీస్ ఘడ్ – 3,013
- ఉత్తరాఖండ్ – 2,984
- జార్ఖండ్ – 2,585
- గోవా – 1,482
- త్రిపుర – 1,440
- మణిపూర్ – 1,279
- హిమాచల్ ప్రదేశ్ – 1,014
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu