దేశంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. సెప్టెంబర్ 17, గురువారం ఉదయానికి కరోనా బాధితుల సంఖ్య 51,18,253 కు, మరణాల సంఖ్య 83,198 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికి దేశవ్యాప్తంగా 6 కోట్లకు పైగా శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించారు. రోజువారి పరీక్ష సామర్ధ్యం కూడా 11 లక్షలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పటికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో 2 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- మహారాష్ట్ర – 11,21,221
- ఆంధ్రప్రదేశ్ – 6,01,462
- తమిళనాడు – 5,25,420
- కర్ణాటక – 4,94,356
- ఉత్తరప్రదేశ్ – 3,36,294
- ఢిల్లీ – 2,30,269
- పశ్చిమ బెంగాల్ – 2,12,383
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu