కేంద్రమంత్రి హర్ సిమ్రత్ కౌర్ తన పదవికి ఈ రోజు రాజీనామా చేశారు. కేంద్రప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఆర్డినెన్సులు, చట్టాలు తీసుకొచ్చిందని, అందుకు నిరసనగా తన పదవికి రాజీనామా చేసినట్టు ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఒక కుమార్తెగా, సోదరిగా రైతుల కోసం నిలబడటం గర్వంగా ఉందని ఆమె తెలిపారు. ముందుగా ఎన్డీఏ కూటమిలో ఉన్న శిరోమణీ అకాలీదళ్ పార్టీ నుంచి హర్సిమ్రత్ కౌర్ కేంద్రమంత్రి పదవిని దక్కించుకున్నారు. ఆమె కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను శిరోమణీ అకాలీదళ్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ బిల్లులపై ఈ రోజు లోక్సభలో చర్చలు జరుగుతున్న సమయంలో కూడా నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. దీంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఊహించని పరిణామం ఎదురైంది. అయితే రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినప్పటికీ శిరోమణీ అకాలీదళ్ ఎన్డీఏలోనే కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
I have resigned from Union Cabinet in protest against anti-farmer ordinances and legislation. Proud to stand with farmers as their daughter & sister.
— Harsimrat Kaur Badal (@HarsimratBadal_) September 17, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu