దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 19,079 కరోనా కేసులు, 224 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,03,05,788 కు, మరణాల సంఖ్య 1,49,218 కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్స్ మరియు ఆసుపత్రుల్లో 2,50,183 మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరోవైపు కొత్తగా 22,926 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 99,06,387 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 96.12 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.45 శాతంగా ఉంది.
ఇక జనవరి 1 నాటికీ దేశంలో 17,39,41,658 కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లోనే 08,29,964 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. మరోవైపు కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో కేరళలో అత్యధికంగా 4991, ఆతర్వాత మహారాష్ట్రలో 3524, వెస్ట్ బెంగాల్ లో 1153, ఛత్తీస్ గడ్ లో 932, తమిళనాడులో 921, కర్ణాటకలో 877, ఉత్తరప్రదేశ్ లో
849, మధ్యప్రదేశ్ లో 780 కేసులు నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ