కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 21,427 కరోనా కేసులు, 179 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 37,45,457 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 19,049 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 18,731 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 35,48,196 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 1,77,683 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక మలప్పురం జిల్లాలో అత్యధికంగా 31456 యాక్టీవ్ కేసులు ఉండగా, కోజికోడ్ లో 26576, ఎర్నాకులంలో 24705, పాలక్కాడ్ లో 14533, త్రిస్సుర్ లో 10392 కేసులు ఉన్నాయి. మరోవైపు బుధవారం నాటికి కేరళలో 2,98,23,377 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ