కేరళలో 24 గంటల్లో 29322 కరోనా పాజిటివ్ కేసులు, 131 మరణాలు నమోదు

Covid-19 in Kerala : 29322 New Positive Cases and 131 Deaths in Last 24 Hours

కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,63,691 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 29,322 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 17.91 శాతంగా నమోదైంది.

అలాగే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 41,51,455 కు చేరుకుంది. ఇక కరోనాకు చికిత్స పొందుతూ మరో 131 మంది మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 21,280కి పెరిగింది. కొత్తగా కరోనా నుంచి 22,938 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 38,83,186 కు చేరుకుంది. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం 2,46,437 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − seven =