కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,00,735 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 45,136 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 44.80 శాతంగా నమోదైంది. దీంతో జనవరి 22, శనివారం మధ్యాహ్నం 2 గంటల నాటికి మొత్తం కేసుల సంఖ్య 55,97,648కి చేరింది.
అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 70 మంది మరణించినట్టు తెలిపారు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం 62 మరణాలను ప్రకటించారు. దీంతో కేరళలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 51,739 కి పెరిగింది. ఇక కొత్తగా 21,324 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 52,97,971 కు చేరింది. ప్రస్తుతం కేరళలో 2,47,227 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కేరళలో ఇప్పటివరకు 4,30,25,275 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF