దేశంలో ఆదివారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,03,23,965 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,49,435 కు పెరిగింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 18,177 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం 20,923 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. గత 37 రోజుల నుండి రోజువారీగా నమోదైన కరోనా కేసుల కంటే దేశంలో రోజువారీగా రికవరీ అవుతున్నవారే ఎక్కువున్నారు. మరోవైపు కొత్తగా నమోదయిన కేసులలో దేశంలోని కేవలం 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల నుండే 81.81 శాతం నమోదయ్యాయి.
కొత్త కేసుల్లో 82 శాతం నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఇవే :
- కేరళ – 5328
- మహారాష్ట్ర – 3218
- ఛత్తీస్ గడ్ – 1147
- తమిళనాడు – 910
- వెస్ట్ బెంగాల్ – 863
- కర్ణాటక – 755
- గుజరాత్ – 741
- మధ్యప్రదేశ్ – 731
- ఉత్తరప్రదేశ్ – 683
- ఢిల్లీ – 491
మరోవైపు గత 24 గంటల్లో 217 మరణాలు నమోదవగా దేశంలోని 7 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలోనే 69.59 శాతం నమోదయ్యాయి.
217 మరణాల్లో 70 శాతం నమోదైన 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఇవే :
- మహారాష్ట్ర – 51
- వెస్ట్ బెంగాల్ – 28
- కేరళ – 21
- పంజాబ్ – 15
- ఢిల్లీ – 14
- ఛత్తీస్ గడ్ – 11
- తమిళనాడు – 11
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ