కరోనాతో ఒకేరోజు 297 మంది మృతి, మరో 14492 పాజిటివ్ కేసులు నమోదు

Covid-19 in Maharashtra: 14,492 New Positive and 297 Deaths Reported on August 22

మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా ఒకేరోజు వ్యవధిలో భారీగా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 22, శనివారం నాడు ఒక్కరోజే కొత్తగా 14,492 కరోనా పాజిటివ్ కేసులు, 297 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,71,942 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 21,995 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 9241 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు 4,80,114 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,69,516 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఆగస్టు 22 నాటికీ మహారాష్ట్రలో 35,75,566 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 16 =