ఒకేరోజు 14,492 పాజిటివ్ కేసులు, 326 కరోనా మరణాలు నమోదు

Covid-19 in Maharashtra: 14,492 New Positive and 326 Deaths Reported Today

మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా ఒకేరోజు వ్యవధిలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 20, గురువారం నాడు ఒక్కరోజే కొత్తగా 14,492 కరోనా పాజిటివ్ కేసులు, 326 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,43,289 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 21,359 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 12,243 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు 4,59,124 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,62,491 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 18 =