దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసులు 30 వేల కంటే తక్కువుగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 22,270 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,28,02,505 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 325 మంది మరణించడంతో మరణాల సంఖ్య 5,11,230 కి పెరిగింది. ఇక దేశంలో కొత్తగా 60,298 కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,20,37,536 కు చేరుకుంది.
ప్రస్తుతం రికవరీ రేటు 98.21 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ప్రస్తుతం 2,53,739 (0.59%) మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక గత 24 గంటల్లో కేరళ (7780), మహారాష్ట్ర (2068), కర్ణాటక (1333), రాజస్థాన్ (1233), మిజోరాం (1151), తమిళనాడు (1146), మధ్యప్రదేశ్ (888), ఉత్తర్ ప్రదేశ్ (842), హర్యానా (675) ఒడిశా (671), గుజరాత్ (617) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ