దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 11 లక్షలు దాటింది. సెప్టెంబర్ 18, శుక్రవారం నాడు కూడా 21656 కరోనా కేసులు, 405 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,67,496 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 31,791 కి పెరిగింది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి 22,078 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు మొత్తం 8,34,432 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 71.47 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.72 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 3,00,887 మంది బాధితులు వివిధ ఆసుపత్రులు, ఐసొలేషన్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు శుక్రవారం నాటికీ మహారాష్ట్రలో 56,93,345 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu