దేశంలో ఇటీవల పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్రత మరింత ఎక్కువుగా ఉంది. ఆ రాష్ట్రంలో 11 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, మరణాల సంఖ్య 30 వేలు దాటింది. సెప్టెంబర్ 16, బుధవారం నాడు కూడా 23365 కరోనా పాజిటివ్ కేసులు, 474 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,21,221 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 30,883 కి పెరిగింది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి 17,559 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు మొత్తం 7,92,832 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 70.71 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.75 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 2,97,125 మంది వివిధ ఆసుపత్రులు, ఐసొలేషన్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు బుధవారం నాటికీ మహారాష్ట్రలో 55,06,276 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu