దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల యొక్క కార్యకలాపాలను రెండు వారాల పాటుగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అక్టోబర్ 2 వరకు దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ఎయిర్ ఇండియా విమానాల రాకపోకలపై నిషేధం విధించినట్టు తెలిపారు. కోవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్ ఉన్న ఓ ప్రయాణికుడు సెప్టెంబరు 4న జైపూర్ నుంచి దుబాయ్ వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్లో ప్రయాణించినట్లు తేలిందన్నారు. ఇలాంటి ఘటన ఇంతకు ముందుకూడా ఓసారి జరిగినట్టు పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణికులకు అనుమతి ఇస్తున్నారని పేర్కొంటూ, సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 2 వరకు ఎయిర్ ఇండియా విమానాలపై నిషేధం విధించినట్టు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ పేర్కొంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu