మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కరోనా కేసులు 25 వేలకు పైగానే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కేసుల నమోదులో తగ్గుదల కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కరోనా కేసుల్లో 62 శాతానికిపైగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 24, బుధవారం నాడు ఒక్కరోజే అత్యధికంగా 31,855 కరోనా కేసులు, 95 మరణాలు నమోదయ్యాయి.
దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 25,64,881 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 53,684 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 15,098 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 22,62,593 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 88.21 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.09 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 2,47,299 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు బుధవారం నాటికి మహారాష్ట్రలో 1,87,25,307 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ