మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా ఒకేరోజు వ్యవధిలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 15, శనివారం నాడు ఒక్కరోజే కొత్తగా 12020 కరోనా పాజిటివ్ కేసులు, 322 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,84,754 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 19,749 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 6844 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు 4,08,286 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,56,409 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలో ఆగస్టు 15 నాటికీ 31,15,716 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu