మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇటీవల రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ 3, శనివారం కూడా 49,447 కరోనా కేసులు, 277 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 29,53,523 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 55,656 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 37,821 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 24,95,315 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 84.49 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.88 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 4,01,172 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు శనివారం నాటికి మహారాష్ట్రలో 2,03,43,123 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ