నాగార్జునసాగర్ లో నామినేషన్ల ఉపసంహరణ పూర్తి, బరిలో మొత్తం 41 మంది అభ్యర్థులు

Nagarjunasagar By-election: Total 41 Candidates are in Competition

నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ముందుగా నామినేషన్ల ప్రక్రియ మార్చి 30తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికకు మొత్తం 77 మంది అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ పరిశీలనలో భాగంగా 17 మంది నామినేషన్స్ ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. అలాగే నామినేషన్ల ఉపసంహరణ గడువు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ముగియగా, మొత్తం 19 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్టు చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయెల్ ప్రకటించారు. దీంతో ఎన్నికల తుదిబరిలో 41 మంది అభ్యర్థులు నిలిచినట్టయింది. ఇక ఏప్రిల్ 17వ తేదీన పోలింగ్ నిర్వహించి, మే 2 వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు. ఈ స్థానంలో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి.

బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే: 

  • టీఆర్ఎస్ – నోముల భగత్ కుమార్
  • కాంగ్రెస్ – జానారెడ్డి
  • బీజేపీ – పానుగోతు రవికుమార్
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 3 =