మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు పదివేలు లోపుగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో జూలై 19, సోమవారం నాడు 6,017 కరోనా కేసులు, 66 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 62,20,207 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,27,097 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 13,051 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 59,93,401 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.35 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.04 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 96,375 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు సోమవారం నాటికి మహారాష్ట్రలో 4,56,48,898 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ