తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సోమవారం నాడు హుజూరాబాద్ నియోజవర్గంలో ‘ప్రజాదీవెన పాదయాత్ర’ ప్రారంభించారు. ముందుగా ఈటల సతీమణి జమున విజయతిలకం దిద్ది, హారతి ఇచ్చి ఈటల రాజేందర్ను ప్రజా దీవెన యాత్రకు పంపారు. అనంతరం కమలాపూర్ మండలం బత్తినవారిపల్లె నుంచి ఈటల రాజేందర్ ఇతర నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నేతలు వివేక్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఏనుగు రవీంద్రనాథ్ రెడ్డి, తదితరులు పాలొన్నారు. తొలిరోజు పాదయాత్రలో భాగంగా హుజూరాబాద్ నియోజవర్గంలోని మాదన్నపేట, శ్రీరాములపేట, అంబల, గునిపర్తి గ్రామాలలోని ప్రజలను ఆయన కలుసుకోనున్నారు.
ప్రజాదీవెన పాదయాత్రపై ట్విట్టర్ వేదికగా ఈటల రాజేందర్ స్పందిస్తూ, “ప్రతిక్షణం వెంటనడిచిన మీకు అనుక్షణం అండగా ఉండడానికి, ప్రాణం పంచే ప్రజల ప్రత్యక్ష దీవెనలు అందుకోవడానికి 22 రోజుల సుదీర్ఘ ప్రజా దీవెన యాత్రకు జూలై 19 నుండి శ్రీకారం చుడుతున్నాను. ఉదయం 7.30 ని.లకు కమలాపూర్ మండలం బత్తినవానిపల్లి శ్రీహనుమాన్ దేవస్థానం నుండి ప్రారంభం అయ్యే ఈ ప్రజా పాదయాత్రకి మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. నా అడుగులకు మీ అండదండలు కావాలి. నా ప్రస్థానానికి మీ ప్రేమాభిమానాలు కావాలి. ప్రజా దీవెన యాత్రకి మీ అందరి దీవెనలు కావాలి. ఆత్మ గౌరవ ప్రస్థానానికి ఇదే తొలి అడుగు” అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ