ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా ముందుగా హెలికాఫ్టర్ లో ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు వద్దకు చేరుకొని క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఇతర నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడారు. స్పిల్వే, అప్రోచ్ ఛానల్ పనులను కూడా పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు పనులపై అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సీఎం వీక్షించారు.
ఆ తర్వాత అక్కడి సమావేశ మందిరంలో పనులు పురోగతి, ఇతర అంశాలపై సంబంధిత అధికారులు, ఇంజనీర్లుతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్ణిత సమయంలో పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. ఈ పర్యటనలో సీఎం వైఎస్ జగన్ తో పాటుగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్, పలువురు అధికారులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ