బీహార్‌ ఎగ్జిట్‌ పోల్స్‌: మహాగట్‌బంధన్‌ వైపే మొగ్గు

2020 Bihar Legislative Assembly election, Assembly Election Bihar 2020, Bihar Assembly Election 2020 Live Updates, Bihar Assembly Election Updates, Bihar Assembly Elections, Bihar Assembly Elections 2020, Bihar Assembly Elections 2020 LIVE Updates, Bihar Assembly Elections News, Bihar Elections 2020, ECI Announced Bihar Assembly Elections 2020,

బీహార్ అసెంబ్లీ తుదిదశ ఎన్నికలు నేడు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ(బీజేపీ-జనతాదళ్ యునైటెడ్), మహాగట్‌బంధన్‌ (కాంగ్రెస్, ఆర్జేడీ,వామపక్షాలు కూటమి), ఎల్జేపీ హోరాహోరీగా పోరాడాయి. కాగా బీహార్ లో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ శాతం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆర్జేడీ అధినేత తేజస్వి ప్రసాద్ యాదవ్ సీఎం అభ్యర్థిగా ఉన్న మహాగట్‌బంధన్ వైపే మొగ్గుచూపాయి. అయితే ‌మరి కొన్ని సర్వే సంస్థలు హంగ్‌ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించాయి.

టైమ్స్‌నౌ- సి ఓటర్ ఎన్డీఏ 116, మహాకూటమికి 120, ఎల్జేపీ 1, ఇతరులుకు 6 వస్తాయని పేర్కొంది. పీపుల్స్‌ పల్స్ ఎన్డీఏ 90-110, మహాకూటమికి 110-115, ఎల్జేపీ 3-5, ఇతరులుకు 8-18 వస్తాయని వెల్లడించింది. ఇక ఏబీపీ న్యూస్ ఎన్డీఏ 104-128, మహాకూటమికి 108-131, ఎల్జేపీ 1-3, ఇతరులుకు 4-8 వస్తాయని అంచనా వేసింది. మరోవైపు బీహార్ లో నవంబర్ 10 న ఓట్ల లెక్కింపు పక్రియ నిర్వహించి, ఫలితాలను వెల్లడించనున్నారు. దీంతో బీహార్ సీఎం పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారో మరో మూడురోజుల్లో తేలనుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =