దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. అయితే రోజువారీ కేసుల్లో కొంత హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో మొత్తం 4,32,777 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 18,257 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 4.22 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,36,22,651 కు చేరుకుంది. అలాగే కొత్తగా 42 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,25,428 కి పెరిగింది.
కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, తెలంగాణ, ఒడిశా, బీహార్ వంటి 10 రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 14,553 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,29,68,533 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.50 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో 1,28,690 (0.30%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అత్యధిక కరోనాకేసులు నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (జూలై 9 (8am)–జూలై 10 (8am)):
- కేరళ – 3186
- పశ్చిమబెంగాల్ – 2968
- మహారాష్ట్ర – 2760
- తమిళనాడు – 2671
- కర్ణాటక – 989
- గుజరాత్ – 668
- ఢిల్లీ – 544
- తెలంగాణ – 528
- ఒడిశా – 512
- బీహార్ – 408
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY