భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 3970 కరోనా పాజిటివ్ కేసులు, 103 కరోనా మరణాలు నమోదయ్యాయి. మే 16, శనివారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 85,940 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 2,752 కి చేరింది. కరోనా బాధితుల్లో 30,153 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 53,035 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో ఈ వైరస్ కు కేంద్రబిందువైన చైనాను భారత్ దాటింది. చైనాలో ఇప్పటికి 82,933 కేసులు నమోదు కాగా, భారత్ లో కేసుల సంఖ్య 85,940 కు చేరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిన దేశాల్లో చైనాను దాటి భారత్ 11 వ స్థానంలో నిలిచింది.
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ అధిక ప్రభావం చూపుతుంది. మహారాష్ట్రలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 29,100 కు చేరగా, 1068 మంది మరణించారు. మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో అత్యధికంగా 10,108, గుజరాత్ లో 9,932 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో 1000 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- మహారాష్ట్ర – 29,100
- తమిళనాడు – 10,108
- గుజరాత్ – 9,932
- ఢిల్లీ – 8,895
- రాజస్థాన్ – 4,838
- మధ్యప్రదేశ్ – 4,595
- ఉత్తర ప్రదేశ్ – 4,057
- పశ్చిమబెంగాల్ – 2,461
- ఆంధ్రప్రదేశ్ – 2,307
- పంజాబ్ – 1,932
- తెలంగాణ – 1,454
- కర్ణాటక – 1,056
- బీహార్ – 1,033
- జమ్మూ కశ్మీర్ – 1,013
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu