దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 11,499 కరోనా కేసులు, 255 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,05,844 కు చేరుకోగా, మరణాల సంఖ్య 5,13,481 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, మిజోరాం, రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 23,598 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,22,70,482 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.52 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో 1,21,881 (0.28%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (ఫిబ్రవరి 25 (8am)–ఫిబ్రవరి 26 (8am)):
- కేరళ – 3,581
- మహారాష్ట్ర – 973
- మిజోరాం – 907
- రాజస్థాన్ – 653
- కర్ణాటక – 628
- మధ్యప్రదేశ్ – 530
- తమిళనాడు – 507
- ఉత్తర్ ప్రదేశ్ – 467
- ఢిల్లీ – 460
- హర్యానా – 399
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ