దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. వీక్లీ మరియు డైలీ పాజిటివిటీ రేట్లలో కూడా స్థిరమైన తగ్గుదల కొనసాగుతుంది. దేశంలో ప్రస్తుతం వీక్లీ పాజిటివిటీ రేటు 0.25 శాతంగా ఉండగా, డైలీ పాజిటివిటీ రేటు 0.22 శాతంగా నివేదించబడింది. ఇక ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 0.04 శాతానికి (15,378) చేరుకున్నాయి.
గత 24 గంటల్లో కొత్తగా 1,259 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,30,21,982 కు చేరుకుంది. అలాగే కరోనాతో 35 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,21,070 కు పెరిగింది. మరో 1,705 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,24,85,534 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.75 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (మార్చి 29, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 78,79,32,913
- మార్చి 29న నిర్వహించిన కరోనా పరీక్షలు : 5,77,559
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,30,21,982
- కొత్తగా నమోదైన కేసులు [మార్చి 28–మార్చి 29 (8AM-8AM)] : 1,259
- నమోదైన మరణాలు : 35
- రికవరీ అయిన వారి సంఖ్య : 4,24,85,534
- యాక్టీవ్ కేసులు : 15,378
- మొత్తం మరణాల సంఖ్య : 5,21,070
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ