దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. తాజాగా మరోసారి 8 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 2.00 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 8,822 పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 14, బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,45,517 కు చేరుకుంది. అలాగే గత 24 గంటల్లో కరోనాతో 15 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,24,792 కి పెరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
దేశంలో 53,637 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.66 శాతం:
దేశంలో ప్రస్తుతం 53,637 (0.12%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 5,718 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,26,67,088 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.66 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. ఇక జూన్ 14, మంగళవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 85.58 కోట్లకు (85,58,71,030) చేరుకుంది. జూన్ 14న 4,40,278 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY