దేశవ్యాప్తంగా ప్రస్తుతం 12 ఏళ్లు పైబడిన వారందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా ఇప్పటివరకు అర్హులైన పెద్దలకు,యువకులకు, పిల్లలకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 181 కోట్లు దాటింది. మార్చి 19, శనివారం ఉదయం 7 గంటల వరకు దేశంలో పంపిణీ చేసిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 181 కోట్లు (1,81,04,96,924) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మరోవైపు దేశంలో మార్చి 16 నుంచి 12 మరియు 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు “కోర్బెవాక్స్” కోవిడ్-19 వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేటగిరి కింద ఇప్పటివరకు 11 లక్షల మందికిపైగా (11,68,106) పిల్లలకు తోలి డోస్ వ్యాక్సిన్ వేసినట్టు తెలిపారు. అలాగే జనవరి 3 నుంచి 15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు/టీనేజర్లకు “కోవాక్జిన్” కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించారు. 15-18 ఏళ్ల కేటగిరి కింద ఇప్పటివరకు 5,61,66,904 మందికి మొదటి డోసు, 3,53,41,348 మందికి రెండో డోస్ వ్యాక్సిన్ వేసినట్టు వెల్లడించారు. ఇక ఇప్పటికే 2,16,60,637 మంది హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ మరియు 60 ఏళ్లు వయసుపైబడివారికీ ప్రికాషన్ డోస్ కూడా అందించినట్టుగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ