దేశంలో గత 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 10,16,920 కరోనా పరీక్షలను నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఆగస్టు 31 నాటికీ మొత్తం 4,33,24,834 మంది శాంపిల్స్ పరీక్షించినట్టు అయింది. దేశంలో ప్రతి మిలియన్ జనాభాకు 31,394 పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. మిలియన్ జనాభాకు అత్యధికంగా పరీక్షలు జరిపే విషయంలో 22 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ సగటు కంటే ముందున్నాయని చెప్పారు. ముఖ్యంగా గోవా, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు రోజువారీ పరీక్షలను అత్యధికంగా నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నందు వలన కరోనా బాధితులను తొలి దశలోనే గుర్తించి వారికి సత్వరం చికిత్స అందించడానికి వీలు కలుగుతుందని, దీంతో దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu