భారత్ క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు సురేశ్ రైనా, సింగర్ గురు రంధ్వాను సోమవారం రాత్రి ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ముంబయి విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఓ క్లబ్ పై దాడులు నిర్వహించిన సమయంలో నిబంధనలకు విరుద్దంగా క్లబ్ నిర్వహణతో పాటుగా కోవిడ్ నియమాలు పాటించకపోవడంతో క్లబ్కు చెందిన ఏడుగురు సిబ్బందితో సహా మొత్తం 34 మందిని చేసినట్టు ముంబయి పోలీసులు పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన వారిలో క్రికెటర్ సురేష్ రైనా, సింగర్ గురు రంధ్వా కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్కు తరలించిన అనంతరం వారిని బెయిల్పై విడుదల చేసినట్లు చెప్పారు.
మరోవైపు కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా డిసెంబర్ 22 నుండి జనవరి 5, 2021 వరకు 15 రోజుల పాటుగా రాష్ట్రంలోని అన్ని మునిసిపల్ కార్పొరేషన్లలో రాత్రి 11 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనుమతించిన సమయం తర్వాత కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ