స్వీయ నిర్బంధంలోకి సీఎం అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal, Arvind Kejriwal Goes Into Self-Quarantine, arvind kejriwal latest news, Arvind Kejriwal Self-Quarantine, Arvind Kejriwal to Undergo Covid-19 Test, Delhi, Delhi Breaking News, Delhi CM, Delhi CM Arvind Kejriwal, Delhi CM Arvind Kejriwal Goes Into Self-Quarantine, delhi coronavirus

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అస్వస్థతకు గురైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. నిన్నటి నుంచి ఆయన జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. దీంతో అధికారిక సమావేశాలు, కార్యక్రమాలను రద్దుచేసుకుని సీఎం కేజ్రీవాల్ స్వీయనిర్బంధంలో ఉండిపోయారు. రేపు సీఎం కేజ్రీవాల్‌కు కరోనా వైద్య పరీక్షలు‌ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఇప్పటికే 28,936 కరోనా కేసులు నమోదవగా, 10999 మంది కోలుకున్నారు, 812 మంది మరణించారు. ప్రస్తుతం 14,396 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 12 =