ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 125 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 28 మంది, విదేశాల నుంచి వచ్చినవారు ఒక్కరు ఉన్నారు. కొత్తగా నమోదైన 125 కేసులతో కలిపి జూన్ 8, సోమవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3843 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో గత 24 గంటల్లో(9AM-9AM) జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 14246 సాంపిల్స్ ని పరీక్షించగా 125 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. అలాగే ఇప్పటివరకు రాష్ట్రంలో ఈ వైరస్ వలన 75 మంది మరణించారు. మరోవైపు రాష్ట్రంలో 2387 మంది కోలుకుని డిశ్చార్జి అవ్వగా, గత 24 గంటల్లో 34 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 1381 మంది చికిత్స పొందుతున్నారు.
ఇక ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 838 మందికి కరోనా నిర్ధారణ అవ్వగా ప్రస్తుతం 520 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. విదేశాల నుండి వచ్చిన వారిలో ఇప్పటికి 132 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా 126 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ 970 కేసులతో కూడా కలిపి రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 4813 కి చేరింది.
#COVIDUpdates: as on 08/06/2020
Positive cases: 3843
Discharged: 2387
Deceased: 75
Active cases: 1381#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/7rZzR4gjry— ArogyaAndhra (@ArogyaAndhra) June 8, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu