దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జామియా నగర్లోని ఎలక్ట్రిక్ మోటార్ పార్కింగ్ స్థలంలో మంటలు చెలరేగడంతో అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, ఘటనా స్థలానికి 11 అగ్నిమాపక యంత్రాలతో చేరుకొని గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. కాగా ఈ ఘటనలో పూర్తిగా చాలా వాహనాలు దెబ్బతిన్నాయి, అలాగే ఈ-రిక్షాలు పెద్ద సంఖ్యలో బూడిదయ్యాయి. కనీసం 10 కార్లు ధ్వంసయ్యాయి. కార్లు కాకుండా కనీసం 30 కొత్త ఈ-రిక్షాలు, 50 పాత ఈ-రిక్షాలు దెబ్బతిన్నాయి. సుమారు 100 వాహనాలు వరకు మంటల బారిన పడి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ పేర్కొంది.
ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ.. జామియా నగర్ ప్రాంతంలోని ప్రధాన టికోనా పార్క్లో అగ్ని ప్రమాదం గురించి ఉదయం 5 గంటలకు కాల్ వచ్చిందని, 11 ఫైర్ సర్వీస్ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని చెప్పారు. ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, అనేక వాహనాలు అగ్నిప్రమాదంలో ధ్వంసమయ్యాయని, చాలావరకు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయని ఆయన తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని గార్డ్ తెలిపారు. అయితే పార్కింగ్ ప్రాంతంలో ఆగి ఉన్న ఒక ఈ-రిక్షాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. కాగా ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF