దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 59,118 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,18,46,652 కు చేరుకుంది. కరోనాతో మరో 257 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,60,949 కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 4,21,066 (3.55%) యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా మహారాష్ట్ర (35952), పంజాబ్ (2661), కర్ణాటక (2523), ఛత్తీస్ ఘడ్ (2419), కేరళ (1989) గుజరాత్ (1961) వంటి 6 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 59,118 కేసులలో 80 శాతం ఈ 6 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి
దేశంలో కరోనా రికవరీ రేటు 95.09 శాతం, మరణాల రేటు 1.36 శాతం:
దేశంలో మరో 32,987 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 1,12,64,637 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 95.09 శాతం గానూ, మరణాల రేటు 1.36 శాతంగా ఉంది. అలాగే గత 24 గంటల్లో రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, ఒడిశా, పుదుచ్చేరి, లక్షద్వీప్, సిక్కిం, లద్దాఖ్, మణిపూర్, త్రిపుర, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబర్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 14 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలాంటి కరోనా మరణాలు నివేదించబడలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ