ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై బుధవారం వర్క్షాప్ ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, రీజనల్ కో ఆర్డినేటర్స్, మరియు జిల్లాల అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వర్క్షాపులో ప్రసంగిస్తూ.. గడపగడపకూ అనేది నిరంతరాయంగా జరిగే కార్యక్రమమని, 8 నెలల పాటు దీనిని నిర్వహించేలా ప్లాన్ చేశామని పేర్కొన్నారు. ఒక్కో సచివాలయానికి రెండు రోజులపాటు కేటాయిస్తూ.. నెలకు 20 రోజుల చొప్పున 10 సచివాలయాల్లో ఇది జరిగేలా చూడాలని సీఎం సూచించారు.
అనంతరం దీనిపై ప్రజల నుంచి వస్తున్న స్పందనపై ఈ వర్క్షాపులో చర్చిస్తామని, ప్రజాప్రతినిధుల నుంచి ఈ వర్క్షాపుల్లో సూచనలు, సలహాలు తీసుకుంటామని జగన్ తెలిపారు. ఇక గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయని, దీనితో సంతృప్తి చెందకూడదని, ఈసారి ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లూ సాధించాలని నేతలకు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 87% కుటుంబాలకు మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చేరాయని, మిగిలిన వర్గాలకు కూడా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి సచివాలయంలోనూ ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకూ దీనిని నిర్వహించాలని, తద్వారా ప్రజాప్రతినిధులందరూ ప్రజల మద్దతు పొందాలని సీఎం జగన్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF