దేశంలో వంట గ్యాస్ సిలిండర్ల ధరలు మరోసారి పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్పై రూ.25.50 పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఈ సవరించిన ధర అన్ని మెట్రో నగరాల్లో జూలై 1, గురువారం నుంచే అమల్లోకి రానుంది. సాధారణంగా ప్రతి నెల మొదటి రోజున, గ్యాస్ సిలిండర్ల ధరల పెంపు/తగ్గింపు విషయంలో ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే ఆయిల్/గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకుంటాయి. అంతర్జాతీయ ఎల్పీజీ రేటు, యుఎస్ డాలర్ మరియు రూపాయి ఎక్స్చేంజ్ రేటు ఆధారంగా, ఎల్పీజీ ధరలను ప్రతి నెల మొదటిరోజున సవరిస్తూ ఉంటాయి. తాజా పెంపుతో సబ్సిడీ ఎల్పీజీ రేట్లు (14.2 కిలోల సిలిండర్) ఢిల్లీలో రూ.834.50, ముంబయిలో రూ.834.50, చెన్నైలో రూ.850.50, కోల్కతాలో రూ.861 కు పెరిగాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ